Showing posts with label తెలుగు పుస్తకాలు. Show all posts
Showing posts with label తెలుగు పుస్తకాలు. Show all posts

Friday, August 3, 2012

మెట్ల మీద - మిడ్కో కథలు



విప్లవ రచయితల సంఘం (విరసం) వారు ప్రచురించిన ఈ పుస్తకం లో మిడ్కో రాసిన పద్దెనిమిది కథలు వున్నాయి. ఇందులో మొదటి పది కథల్లో మధ్య తరగతి స్త్రీ-పురుష సంబంధాల గురించిన విశ్లేషణ వుంటుంది. అన్ని కథలూ
స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల చుట్టూ తిరుగుతాయి. రచయిత ఒక స్త్రీ అవడం మూలాన అనుకుంటా అన్ని కథల్లోనూ స్త్రీ పాత్ర పరంగా కథ చెప్పబడుతుంది.

 తర్వాత వచ్చే ఎనిమిది కథలు మాత్రం నేను ఇంతవరకూ చదవని అంశం గురించి వున్నాయి. నక్సల్స్ ఉద్యమ నేపధ్యం లో తెలంగాణా ప్రాంతం లోని స్త్రీల కష్టాలు, కన్నీళ్లు, వేదన, పట్టుదల, పోరాటం గురించి రాసారు. చివరి కథ అయిన "మెట్ల మీద" మాత్రం కథా నాయకుడి కోణం లోనుండి చెప్పబడింది. ఉద్యమం లో నుండి బయటకి వచ్చేసాక అతని చుట్టూ ఉన్న సమాజం లో జరిగిన మార్పులకు, కుటుంబ సభ్యుల, స్నేహితుల దృక్కోణం లో మార్పులకు, వారి దృష్టిలో తన స్థానం గురించిన సంఘర్షణ నేపధ్యం లో వుంటుందీ కథ. ఈ ఎనిమిది కథలూ తెలంగాణా మాండలికం లో వున్నాయి.

మొత్తానికి అన్ని కథలూ బావున్నాయి. మిడ్కో అంటే గోండు (ఒక ఆదివాసీ తెగ) బాషలో మిణుగురు పురుగు అట :)

Thursday, August 2, 2012

పాలగుమ్మి విశ్వనాథం - ఆత్మకథ


ప్రముఖ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అయిన పాలగుమ్మి పద్మరాజు గారి తమ్ముడు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. పశ్చిమ గోదావరి జిల్లా లోని తిరుపతిపురం అనే ఊరిలో 1919 సంవత్సరం లో జన్మించిన విశ్వనాథం గారు తెలుగు వారి ముంగిట్లోకి AIR ద్వారా లలిత సంగీతాన్ని తీసుకువచ్చిన ఆద్యులు. ఈయన స్వరకర్త, గాయకుడు, వీణా విద్వాంసులు కూడా."అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగా" అన్న పాట (ఈయన రచించి, స్వరపరిచినది..వేదవతి ప్రభాకర్ గారు పాడింది) ఇప్పటికీ తెలుగు వారి లోగిళ్ళలో వినిపిస్తూనే వుంటుంది..ఇంకా ఇలాంటివే ఎన్నో మధురమయిన పాటలు ఎన్నింటినో పరిచయం చేసిన విశ్వనాథం గారి ఆత్మ కథ ఎంతో బావుంది.

గోదావరి జిల్లాలో ఆయన గడిపిన బాల్యం, గాంధీజీ గారు చేప్పట్టిన హరిజనోద్ధరణ ఉద్యమం లో విశ్వనాథం గారి బాబయ్య గారి పాత్ర గురించిన వివరాలు ఎంతో ఆసక్తి కలించాయి. తర్వాత విశ్వనాథం గారి సాహిత్య అభిలాష, సంగీత సాధన కోసం చెన్నై వెళ్ళడం, అక్కడ గొప్ప గొప్ప విద్వాంసులతో పరిచయాలు, సినీ రంగం లో ఆయన పాత్ర, అక్కడి నుండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో ఉద్యోగం ఇవన్నీ ఆయన మాటల్లో వివరించారు. ఆకాశవాణి లో పనిచేసేటప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి లాంటి ప్రముఖులతో సాహచర్యం ఏర్పడింది విశ్వనాథం గారికి.కృష్ణ శాస్త్రి గారు రాసిన ఎన్నో పాటలకు విశ్వనాథం గారు స్వరాలు సమకూర్చారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సంగీత రూపకాలకు నేటికీ ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగు సంగీతం లో ప్రముఖులయిన వారెంతో మంది ఒకప్పుడు విశ్వనాథం గారి దగ్గర శిష్యరికం చేసిన వారే.ఆకాశవాణి లో పదవీ విరమణ అనంతరం క్రైస్తవ మత బోధకుడయిన హ్యుబర్ట్ సికింద్రాబాద్ లో స్థాపించిన అమృతవాణి కైస్తవ మిషన్ కి భక్తి గీతాలు సమకూర్చారు విశ్వనాథం గారు.

తెలుగు జాతి రత్నాలలో ఒకరిగా ఎన్నదగిన పాలగుమ్మి విశ్వనాథం గారిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులతో సత్కరించింది. ఈ ఆత్మకథ సంకలనం చదవడం ద్వారా మరుగున పడిన ఆకాశవాణి జ్ఞాపకాలు మదిని పలకరించాయి.


Saturday, April 28, 2012

జతగాళ్ళు-కతగాళ్ళు - మునిరాజు, సురేష్ రెడ్డి



స్నేహితులయిన ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి ఒకరు చెప్పుకునే కథల సమాహారమే ఈ పుస్తకం. చిన్నప్పుడు బామ్మ, తాతయ్య చెప్పే నీతి కథల్లాంటి కథలున్నాయి ఈ పుస్తకంలో. చాలా కాలం క్రితం చదివిన చందమామ, బాలమిత్ర కథలు జ్ఞాపకం వచ్చాయి ఇవి చదువుతుంటే. చదవడానికి  పిల్లలకి చెప్పే బెడ్ టైం స్టోరీస్ లాగా అనిపించినా వీటిలో వున్న నీతి గురించి తెల్సుకోవడం అందరికీ అవసరమే.

చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు - అమరనారా బసవరాజు (హోసూరు కథలు)



ఎటువంటి కల్పనా లేని వాస్తవిక కథలు ఇవి. రచయిత తనకు ఎదురయిన అనుభవాలు, పల్లెలోని వాతావరణం, ప్రకృతి, అక్కడి మనుషుల నమ్మకాలు వీటి గురించి తనదయిన భాషలో వర్ణిస్తారు. ఈ కథలలో హోసూరు (కర్ణాటక) ప్రాంతం లో ని సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి జీవిత చిత్రాలు అన్నీ ఇమిడి వున్నాయి. వివిధ ప్రాంతాల నేపధ్యాలలో రాయబడిన కథలు ఇష్టపడే వారికి ఈ కథలు బాగా నచ్చుతాయి.

మిథునం - శ్రీ రమణ


శ్రీ రమణ గారు రాసిన ఎనిమిది కథల సంపుటి ఈ పుస్తకం. సున్నితమయిన వ్యంగ్యం, గిలిగింతలుపెట్టే హాస్యం, చక్కని శైలి తో ఇందులోని కథలన్నీ ఆకట్టుకుంటాయి.

ఇందులోని మొదటి కథ 'అరటిపువ్వు సాములారు' నాకు అంతగా నచ్చలేదు, మొత్తం కథల్లో నాకు అంతగా నచ్చని కథల్లో ఇది ఒకటి, మరోటి 'పెళ్లి' అనే కథ. ఈ కథంతా ఒక పెళ్లి లో జరిగే సంభాషణల చుట్టూ తిరుగుతుంది. బోల్డన్ని అంశాల చుట్టూ తిరిగే ఈ సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.
నచ్చని కథలను వదిలేసి నచ్చిన కథల్లోకి వచ్చేస్తా,

తేనెలో చీమ - కథానాయకుడి జీవితంలోని విషాదానికి కొంచెం వ్యంగ్యం జోడించి రాసిన కథ. పేరు అతికినట్టుగా సరిపోయింది :)


వరహాల బావి - ఒక ఊరిలో వరహాలమ్మ అనే పెద్దావిడ ఇల్లున్న చోట తవ్విన బావి ఊరందరికీ ఎలా దారి చూపిందో, అదే బావి ఊర్లో గొడవలకు ఎలా దారి తీసిందో చాలా చక్కగా వర్ణించిన కథ.

ధనలక్ష్మి - భార్య-భర్తల మధ్య వచ్చే 'ఇగో' సమస్య గురించిన కథ. ధనలక్ష్మి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.

షోడా నాయుడు - షోడా గోలి కోసం షోడా అమ్మే నాయుడి చుట్టూ తిరుగుతూ కథకుడు పడే పాట్లతో నవ్వు తెప్పిస్తూనే గడచిపోయిన మన బాల్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది ఈ కథ.

బంగారు మురుగు - ఇది నా alltime ఫేవరెట్ కథ. వేరే కథా సంపుటాల్లో ఈ కథ చదివేసాను. కానీ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.వెనకటి తరం లోని కుటుంబ వాతావరణం, బామ్మ-మనుమడి అనుబంధం, బామ్మ గారి లౌక్యం, గుణం అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి.

మిథునం - ఇది భార్యా-భర్తల మధ్య జరిగే కథ. ప్రతి ఇంట్లోనూ ప్రతి నిత్యం సాగే సరదా గొడవలు, వాటితోనే ఇద్దరి సహజీవనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో తాతగారికి తిండి యావ ఎక్కువ. నాకయితే కథ చదువుతున్నంత సేపు నోట్లో నీళ్లూరుతూనే వున్నాయి ఆ పాత కాలం నాటి వంటలు, అవి వండే విధానం చదువుతూ వుంటే.

పుస్తకం మొత్తం చదివేసాక కమ్మటి తెలుగింటి భోజనం చేసినట్టనిపించింది నాకు :)


Friday, April 20, 2012

న్యూ బోంబే టైలర్స్ - ఖదీర్ బాబు



ఖదీర్ రాసిన 'దర్గామిట్ట కథలు, 'పోలేరమ్మ బండ' నాకు చాలా ఇష్టమయిన పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలలోని కథల్లో ఖదీర్ తను, తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, తను పుట్టి పెరిగిన ఊరయిన కావలి గురించి మనకి పరిచయం చేసారు. వీటిలో అంతర్లీనం గా బోల్డన్ని emotions , సెంటిమెంట్స్ దాగి వుంటాయి. అయితే ఏ కథ చదివినా సరదాగా నవ్వించేలాగానే వుంటుంది .

ఈ 'న్యూ బోంబే టైలర్స్' మాత్రం పైన చెప్పిన రెండు పుస్తకాలకి భిన్నంగా వుంటుంది.

'న్యూ బోంబే టైలర్స్' , 'పెండెం సోడా సెంటర్' కథలు కార్పోరేట్ కంపెనీ లు  చిన్న చిన్న పట్టణాల్లోకి దూసుకుని వచ్చి అక్కడి లోకల్ వ్యాపారస్తులని ఎలా దెబ్బ తీస్తున్నాయో ఆ నేపధ్యం లో వుంటాయి. 'దావత్', 'జమీన్','కింద నేల వుంది','ఖాదర్ లేడు' ,'గెట్ పబ్లిష్డ్' మొదలయిన కథలు కూడా విభిన్న అంశాల నేపధ్యంలో వుంటాయి. కొన్ని కంట తడి పెట్టిస్తే, కొన్ని ఆలోచింపచేసేలా వుంటాయి. మొత్తానికి అన్ని కథలూ బాగున్నాయి. ఇవన్నీ కూడా magazines (ఎక్కువగా సండే ఆంధ్రజ్యోతి) లో వచ్చినవే. అయితే నేను అవేవీ చదవలేదు ఒక్క 'ఖాదర్ లేడు' తప్ప. ఇప్పుడు అన్నీ ఒకే పుస్తకం లోకి తీసుకొచ్చి మంచి పని చేసారు, నాలాంటి వాళ్ళు మిస్ కాకుండా.

పదేళ్ళ క్రితం ఖదీర్ తో నాకు పరిచయం వుండేది. చాలా సరదాగా ఉండేవాడు.అతను ఇంత సీరియస్ కథలు రాస్తాడని అప్పుడు ఊహించనేలేదు. అసలు నేను అతని కథలకి అభిమానినవుతానని అనుకోనేలేదు :)

Friday, March 16, 2012

డేగ రెక్కల చప్పుడు - యండమూరి వీరేంద్రనాథ్

 

నేను చదివిన పుస్తకాలలో నాకు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకాల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా వున్నాయి. ఈయన నవలల్లో నేను మొట్ట మొదట చదివింది "నల్లంచు తెల్ల చీర". అప్పటి నుండి ఆయన నవలల్లో మూడు నాలుగు పుస్తకాలు తప్ప మిగతావి ఏవీ  వదిలిపెట్టకుండా చదివేసాను. దొరికినంత వరకూ కొని దాచుకున్నాను కూడా. ఈయన రాసిన కాసనోవ 99 , తులసి దళం, అష్టా వక్ర లాంటి థ్రిల్లర్స్ తెలుగులో మరే రచయిత ఇంత ఆకట్టుకునేలా రాయలేరేమో అనిపిస్తుంది. ఈయన ఇంగ్లీష్ నవలల నుండి కాపీ చేస్తారని, రచనా స్వేచ్చ ఎక్కువ తీసుకుంటారని అంటారు కానీ నేను ఇంగ్లీష్ నవలలు ఎక్కువ చదవలేదు కాబాట్టి నాకు అలా ఏమీ అనిపించదు. ఈయన రాసిన నవలలు అన్నిటి గురించి ఒక పోస్ట్ రాయాలని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు.

ఈ నవల "డేగ రెక్కల చప్పుడు" సాక్షి ఆదివారం edition లో సీరియల్ గా వచ్చినప్పుడు నేను కావాలనే చదవలేదు. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏకబిగిన చదివేయ్యాలి నేను. వారం వారం ఎదురు చూడటం నా వల్ల కాని పని. అందుకే నవలగా వచ్చాక చదివాను. ఇంతకు ముందు ఈయన రాసిన "ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే నవల లోని కథకి, ఈ నవలలోని కథకీ దగ్గరి పోలికలు వున్నాయి. అయితే రెండూ వేటికవే బాగున్నాయి.

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యం లో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తి ని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రి ని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పని చేసాడు, అతని అసలు mission  ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపధ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది. 

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్చ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.

Monday, February 20, 2012

తన్హాయి - కల్పనా రెంటాల



ప్రేమ ని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా నిర్వచించారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ప్రేమ కి ఇదే సరయిన అర్ధం అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. మన సమాజం లో ఎన్నో రకాల ప్రేమలు ఆమోదించబడతాయి కానీ వేరు వేరుగా  పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అంటే మాత్రం అందరూ నిరసిస్తారు. స్త్రీ-పురుషుల మధ్య ఏర్పడే ప్రేమలో శారీరక సంబంధానికి చోటు వుండే అవకాశం వలననేమో ఇలాంటి ప్రేమలు ఎవరూ ఒప్పుకోరు. పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహంగా మొదలయిన పరిచయం క్రమంగా పెరిగి ప్రేమగా మారి ఇద్దరి కుటుంబాలను, జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో అనేదే ఈ కథాంశం.

ఈ కథ అంతా అమెరికా లో రెండు తెలుగు కుటుంబాల మధ్య జరుగుతుంది. కల్హార-చైతన్య దంపతులకు ముద్దులొలికే పాప మేఘన. కౌశిక్-మృదుల దంపతులకు తుషార్ అనే ఏడేళ్ళ బాబు ఉంటాడు. రెండు కుటుంబాలు టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ పట్టణంలో వుంటాయి. రెండు జంటలూ ఇండియాలో మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ప్రశాంతమయిన జీవితం గడుపుతుంటారు.ఎవరికీ భాగస్వాముల మీద ఎలాంటి కంప్లైంట్స్ వుండవు (చిన్న చిన్న గొడవలు తప్ప). ఒక ప్రయాణంలో కల్హార-కౌశిక్ మధ్య పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోనే ఒకరికి ఒకరు నచ్చుతారు. మొదట స్నేహితులుగా వుందామనుకున్న వారిద్దరూ క్రమేణా ఒకరిని విడిచి ఒకరు వుండలేనంతగా దగ్గరవుతారు. అయితే తమ ప్రేమ కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదులుకోవాలన్న ఆలోచన వుండదు. వీళ్ళ ప్రేమ విషయం తెల్సిన చైతన్య, మృదుల లు ఎలా స్పందించారు, చివరికి కల్హార-కౌశిక్ ల మధ్య ప్రేమ ఎలా నిలిచిందీ, ఈ క్రమం లో నలుగురూ పడిన మానసిక సంఘర్షణ ని రచయిత్రి ఎంతో హృద్యంగా వర్ణించారు.

ఈ నవల చదివాక ప్రతి పెళ్ళయిన వ్యక్తి ఇందులో వున్న ముఖ్య పాత్రలలో ఏదో ఒక దానిలో తమని తాము identify చేసుకోగలరు. ఇందులో కథ కంటే కూడా పాత్రధారుల మానసిక సంఘర్షణ ను ఎక్కువ హైలైట్ చేసారు. కొన్ని వాఖ్యాలయితే నాకు చాలా చాలా నచ్చాయి,

అశాంతికి కారణం అసంతృప్తి

మనసు మాట వినేవారికి ఉన్నంత నరకం మరోటి వుండదు (ఈ మాట నాకు సరిగ్గా గుర్తు రాట్లేదు. పుస్తకం ఏమో ప్రస్తుతం నా దగ్గర లేదు)

స్నేహం, ప్రేమ అందరి పట్ల ఒకేలా వుండదు. ఒకరి దగ్గర ప్రవర్తించినట్టు, ఫీల్ అయినట్టు మరొకరి దగ్గర ఫీల్ అవలేము, ప్రతి స్నేహం, ప్రేమ వేటికవే విభిన్నం.

ఒక పని చేయాలని తీవ్రంగా అనిపించినప్పుడు ఆ పని చెయ్యడం తప్పు కాదు అని మనసు మనకి అనుకూలంగా నచ్చ చెప్తుంది. అది గుర్తించకపోతే మనసు వేసే ట్రాప్ లో చిక్కుకోక తప్పదు.

ఇంకా ఇలాంటివెన్నో వున్నాయి పుస్తకం నిండా. మొదట సాధారణంగా మొదలయిన కథ లోతుకి వెళ్ళే కొద్దీ పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళెదుట నిలిచాయనిపిస్తుంది. ఆ ప్రాత్రల సంఘర్షణలో మన మనసూ, మెదడూ కూడా ఒక భాగమయిపోతాయి. కథాంశం విన్న తర్వాత ఇది అక్రమ సంబంధాలను ప్రోత్సహించేదిగా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ చదివే కొద్దీ తమకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఇద్దరు బాధ్యాతాయుతమయిన వ్యక్తుల మానసిక స్థితి కి ఇది సజీవ రూపంగా నిలుస్తుంది. మ్యారేజ్ counselling బుక్ లా అనిపించింది నాకయితే.

ఇంత మంచి నవలను అందించిన కల్పన గారికి అభినందనలు.

Image source : Saaranga books


వేలుపిళ్లై - సి.రామచంద్రరావు



నేను ఈ పుస్తకం చదవాలనుకోవడానికి కారణం దీనికి ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి రామమోహనరావు గారు రాసిన పరిచయ వాఖ్యలు :) గడిచిన కాలం లో ఈ రచయత రాసినవి ఈ తొమ్మిది కథలే అయినా టాప్ టెన్ రచయతల్లో రామచంద్రరావు గారిని ఒకరిగా చాసో గారు వర్ణించారు అంటే తప్పకుండా ఇవి బాగుండి వుంటాయి అని చదవడం మొదలుపెట్టాను. ఇందులోని కథలన్నీ అరవై-డెబ్బై ఏళ్ళ క్రిందట రాసినవి.రచయిత అప్పట్లో కర్నాటక/తమిళనాడు లోని ఒక టీ-ఎస్టేట్ లో ఉన్నతాధికారిగా పని చేసారు, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా.

ఈ సంపుటి లో తొమ్మిది కథలున్నాయి. అన్నిటిలో ఏది నచ్చింది అని అడిగితే చెప్పడం కష్టమే. వేటికవే ప్రత్యేకమయినవిగా తోచాయి. ఎక్కువ కథలకు నేపధ్యం టీ-ఎస్టేట్ లోని జీవితమే. స్త్రీ-పురుషల సంబంధాలు, భార్య-భర్తల అనుబంధాలు, యజమాని-నౌకరు సంబంధాలు, సహోద్యోగుల మధ్య వుండే వాతావరణం, మనిషికి-జంతువుకి మధ్య వుండే సున్నితమయిన సెంటిమెంట్స్ ఇలా మానవ సంబంధాలలో వున్న అనేకానేక కోణాలను స్పృశిస్తూ రాసిన కథలు ఇవన్నీను. ఒక్కో కథ రాయడం కోసం రచయిత చేసిన పరిశీలన మెచ్చుకోదగినది. ముఖ్యంగా 'ఏనుగులరాయి' కథలో ఏనుగుల మనస్తత్వాన్నీ, కడకరైకీ-ఏనుగులకీ మధ్య వుండే అనుబంధాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎంతో పరిశీలనా దృష్టి వుంటే కానీ ఇది సాధ్యపడదు. కథల్లోని పాత్రలన్నీ సజీవంగా, వాస్తవికంగా వున్నాయి.

ఈ కథల్లోని పాత్రదారులు ఎక్కువ మంది తమిళ తంబిలు, ఇంకా తెల్ల దొరలూ. అయినా స్వచ్ఛమయిన తెలుగు కథలు చదువుతున్నట్టే అనిపించింది. తెలుగు కథ రాయడానికి ప్రాత్రధారులు, నేపధ్య వాతావరణం తెలుగు మాత్రమే కానవసరం లేదు అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. పడమటి కనుమల మధ్య, పచ్చటి టీ-కాఫీ తోటల్లో విహరిస్తూ స్వచ్ఛమయిన గాలి పీలుస్తూ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వచ్చింది ఈ కథలు చదువుతుంటే.

Friday, February 17, 2012

ఇదీ నా కథ - మల్లెమాల


మల్లెమాల గారి గురించి తలచుకోగానే నాకు గుర్తొచ్చేవి రెండే విషయాలు, అంకుశం సినిమాలో ఆయన రోల్, బాల రామాయణం సినిమా. ఆయన్ని చూస్తే పాత కాలం లో వుండే స్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయుడు గుర్తొస్తారు. ఈ మధ్య ఆయన తన గురించి రాసుకున్న ఈ పుస్తకం గురించి చాలా వార్తలే విన్నాను.ఇలాంటివి విన్న కొద్దీ చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది కదా. పైగా మా జిల్లా ఆయన కదా, ఇక చదవాలనే అనుకున్నాను. అమ్మమ్మ దగ్గర ఈ పుస్తకం వుంది, చదివేసాను.

మల్లెమాల గారు కవి అని తెల్సు కానీ ఎప్పుడూ ఆయన రాసిన గేయాలు, గట్రా చదవలేదు. ఈ పుస్తకంలో చదువుతున్నప్పుడు హై-స్కూల్ చదువు కూడా లేకపోయినా ఇంత బాగా ఛందస్సు, వ్యాకరణం మీద పట్టు సాధించడం చాలా గొప్ప విషయమే అనిపించింది. ఇక ఆయన మనసు విప్పి తన గురించి చెప్పుకున్న విషయాలలో ఎక్కువ భాగం తను సాధించిన విజయాల గురించే వున్నా కూడా ఏంటో చాలా మామూలుగా చెప్పినట్టే వుంది కానీ కావాలని తన గురించి తాను ఎక్కువ చేసి గొప్పలు చెప్పుకున్నట్టు లేదు. రామారావు, శోభన్ బాబు, గుణశేఖర్, బుజ్జి రామారావు (Jr NTR ), శ్యాం ప్రసాద్ రెడ్డి -  వీళ్ళందరి గురించి విమర్శించారు. వీళ్ళంతా కూడా మనకి ఒక రకమయిన వ్యక్తులుగానే తెలుసు, కానీ ప్రతి ఒక్కరిలో వేరు వేరు కోణాలున్నట్టే వీరి జీవితంలో కూడా మనకి తెలీని చాలానే విషయాలు జరిగి ఉండి ఉండవచ్చు. మల్లెమాల గారు తనకి ఎదురయిన చెడు అనుభవాలు వ్యక్తపరిచే  క్రమంలో వీళ్ళ పేర్లు బయటకి వచ్చాయి, అంతే. ఇవి నిజాలా కాదా అనేది నేను పట్టించుకోను. ఆయా వ్యక్తుల మీద నాకు అంతకు ముందున్న అభిప్రాయం ఇవి చదివాక మారదు కూడా :)

మొత్తం మీద పుస్తకం అయితే బాగుంది.

అధో జగత్ సహోదరి - అక్కినేని కుటుంబరావు



ఇది ఒక కన్నీటి గాధ. దుర్గ అనే ఒక పేదింటి అమ్మాయి ఒక మోసగాడి చేతిలో చిక్కి, వ్యభిచార కూపంలో ఇరుక్కుని, రకరకాల పరిస్థితుల్లో, రకరకాల మనషులు మధ్య దుర్భరమయిన జీవితాన్ని గడిపి, అత్యంత దురద్రుష్టకరమయిన స్థితిలో తనువు చాలించడం ఈ కథ యొక్క సారాంశం. రచయిత కి సమాజం లో ఉన్న ఒక నీచ సంస్కృతి పట్ల ఉన్న కసి చాలా చోట్ల వ్యక్తమవుతుంది.

కుటుంబరావు గారి పుస్తకాలు ఇంతకు ముందెప్పుడూ చదవలేదు. ఇదే మొదటిది, ఇక ఇదే ఆఖరుది కూడా :)

Thursday, January 19, 2012

Yugaaniki Okkadu – Vinayaka Rao

Yugaaniki okkadu – The one and only one name that strikes my mind when I hear this word is none other than our legendary actor NTR. Though he’s equally popular as the founder and leader of TDP, I remember him just as a great actor. I know nothing about his political career and I’m not at all interested in it and may be this’s  the reason why I prefer to be a fan of his acting skills and have no particular impression on his political life. People in my home worship him as a demi-god. I still remember the day he passed away. My uncle cried out like hell and my other relatives were left in deep shock :)


Coming to this book, this is all about NTR’s filmy career – his movies, heroines, cine records, his relation and dealings with technicians, producers, directors and some interesting info about his mannerisms in some movies and all that sort of articles. Some rare photographs have also been included. This’s would be a good library collective for hardcore NTR fans. Otherwise, there’s nothing spl abt it. Just a one-time read may be.

Mittoorodi Pusthakam – Naamini Subramanyam Naidu




Naamini – Writer of the Masses…this’s how I feel when I read his books…I’ve read this mittoorodi pusthakam long back, but missed to post the review here…Recently re-read it and hence thought of posting..

This book is a collection of 6 of Naamini’s books published earlier,

Pacchanaaku Saakshiga – I guess this one is the writer’s first work…This’s a collection of short stories narrating his childhood spent in a remote village in Chittoor dt. He belongs to a very poor peasant family. I loved the character of his mother Sinakka.She is an Icon of present day rural women…Hardworking, courageous and also helplessly cunning at times to feed her children.

Sinabba Kathalu – This one again is a collection of short stories…All the stories revolve around his high school life, friends and teachers.

Mittoorodi Kathalu – This is also a collection of stories written after his marriage. So most of them revolve around the couple, their fights, family issues etc

Munikannadi Sedyam – This is a short novel which reminded me of Chandralatha’s ‘Regadi Vitthulu’ (my all time favourite novel based on agricultural revolution). Farming issues in rural areas of Chittoor dt, problems faced by lease farmers(koulu raithulu) etc are narrated in a heart-touching manner.

Pala podugu – This is a short novel describing the life of a very poor family who earns livelihood by selling milk.
Sundaramma kodukulu – This is also a short novel depicting the joint family issues in a poor peasant family, their struggle for existence, fights among the co-sisters and all.

All in all, this total book describes the life style of rural Chittoor dt. Written in the most raw slang of rayalaseema area (including some naatu pacchi boothulu :P ). I’m used to hear this kind of slang in our villages. So it was an easy read for me. But for those who are not familiar with the slang might find it difficult to understand some words.

Jeevithame Oka Prayogam – Edited by Volga

This is a collection of autobiographic stories told by 6 different women from different fields in a visual history workshop conducted by Sparrow.

1. Venditera Velugu – Esther Victoria Abraham (Prameela) – Film artist (one of those primitive bollywood/hindi cinema heroines)
2. Raayi – Bangaaram – Kanakamurthy -  A Traditional Sculptor
3. Menaka Maanasa Putrika – Damayanthi Joshi -  Dancer (Kathak dancer)
4.  Patrika rangaanni rangasthalaanni kalipina Sushma Despaande – An investigative journalist and a Theatre atrist
5. Rangasthalam oka Adbhutha Pradesam – Maaya – A Kathakali dancer and a Theatre artist
6. Sampradaaya Varnaalu – Neela – Painter
In this book, each of these women narrate their  experiences, feelings, hardships they’ve faced and struggle to identify themselves in their chosen field of art.

Not a casual read, go for it only if you are interested to know about different forms of art and artists, their experiences and all.

This book was gifted to me by Volga and Kutumbarao garu on my wedding day :) And it took more than 7 years for me to open and go thru it :)

Nigaah – K.Balagopal

This book is  a collection of 115 articles written by Dr K Balagopal for the magazine ‘Prajathanthra’ during the years 1998-2003. This’s the first part and the rest of the articles are yet to be compiled into part-2 of this book.

All these articles are the authors’ comments about various issues ranging from tribals to international affairs. There’s absolutely no subject that’s untouched here. Aadivaasis, Riots, Naxals, Govt policies, Tibetans, India-Pak war, 9/11 in US of A, Telangana, Agriculture, Irrigation projects, Religious affairs etc…everything is discussed in this book. I haven’t got proper knowledge regarding any of these issues, also all the incidents that’ve been quoted in this book occured about a decade ago, so it was a tough read for me.

History of India – Romila Thapar

This book details the history of India in ancient and medieval ages. It starts with the Iron age civilization and ends with the declination of Mughal empire in the 18th century after the arrival of British. In the very first chapter the author describes how man in Iron age transformed from a food gatherer to a food producer.

Indus valley /Sind civilization, Mohenjadaro-Harappa cities and their infrastructure, Aryan civilization are described in the next few chapters. The emergence and declination of some famous empires like Magadha, Mourya, Gupta, Pallava, Chola, Chera, Pandya, Satavaahana, Mughal etc are detailed. The social, cultural, economical, political and geographical conditions prevalent in each era are discussed. Some religious aspects in Buddhism, Jainism and Islam are also presented.

This book is just about 178 pages, but it gives you an overall picture of entire history of ancient and medieval India. A delighful read for history lovers :)


Telugu translation was done by Sahavasi. Printed by HBT(Hyderabad Book Trust)

Raathi Poolu – C.Sujatha

This is a novel written in the backdrop of corporate world and cine industry. The story revolves around three women, Samantha, Jamuna and Kinnera who belong to ordinary middle class families. They’ve an urge to develop in their respective careers and become financially sound enough to support their families and get hold of all materialistic possessions in the urban culture. This novel describes the emotional struggle that these three women undergo during the process of their settlement in life. How people now a days get attracted to money and success and in this process how the family,human relations, morals and beliefs tend to vanish are described in a heart-touching manner. Title is aptly chosen.


Nice and quick read. Totally loved it :)

Penkutillu – Kommuri Venugopala Rao

I heard many good reviews about this book, so started with great expectations.


It’s the story of a middle class family in 1960′s (or may be 70′s)….Chidambaram, a lazy n good for nothing fellow lives with his family of 7 including his 4 children. The novel is all about their day-to-day lives,struggle for existence, adjustments and finally ends with a happy note. It reflects the financial and caste discrimination system prevalent at that time.

Good at parts, nothing so great. Just on OK to read.

Gadi Lopali Goda – Palamaneru Balaji

A collection of 19 short stories. The author chose a wide variety of topics like farmers’ suicides, corporate education system, problems related to women and many other issues as subjects to these stories. Each story is unique, most of them reflect our day to day lives and we can identify ourselves in few characters. Loved all of them.

Simple, yet thought provoking.

Gaalikondapuram railway gate – Vamsee

I’m a huge fan of writer/director Vamsee. I’ve read his 3 short story complilations (Maa Pasalapudi Kathalu,  Aanaati Vaana chinukulu and Aaku pacchani Gnaapakam) earlier, totally totally loved them. Coming to  novels, this’s my first read.


It’s a suspense thriller written in the backdrop of the beautiful Araku valley and Dandakaaranya forests. Like in all other Vamsee’s writings I’ve read so far, there is no focus on the storyline in this book too. The narration, characters in the story and the wonderful description of the scenic beauty of the locations captivate the reader.
Light n quick read, recommended for Vamsy’s fans :)